శ్రీ భగవానువాచ :
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ॥ 2
మయి, ఆవేశ్య, మనః, యే, మామ్, నిత్యయుక్తాః, ఉపాసతే,
శ్రద్ధయా, పరయా, ఉపేతాః, తే, మే, యుక్తతమాః, మతాః.
యే = ఎవరు; మయి = నాయందు; మనః ఆవేశ్య = మనస్సును నిలిపి; నిత్యయుక్తాః = ఏకనిష్ఠులై; పరయా = ఉత్తమమైన; శ్రద్ధయా ఉపేతాః = శ్రద్ధతో గూడి; మామ్ = నన్ను; ఉపాసతే = ఉపాసిస్తున్నారో; తే = వారు; యుక్తతమాః = శ్రేష్ఠులైన యోగులని; మే = నాచే; మతాః = తలంపబడినవారు.
తా ॥ శ్రీ భగవానుడు పలికెను: ఎవరు ఏకనిష్ఠులై పరమ శ్రద్ధతో నా విశ్వరూపంపై మనస్సును నిలిపి, సర్వజ్ఞుణ్ణి, పరమేశ్వరుణ్ణీ అయిన నన్ను భజిస్తున్నారో, వారు శ్రేష్ఠులైన యోగులని నా అభిప్రాయం. (గీత 6-47 చూ.)